- మళ్లీ ప్రతి స్కూల్ నుంచి కొందరు టీచర్ల ఎంపిక
- సెలవులు పొడిగించడంతో రీ షెడ్యూల్ చేసిన ఆఫీసర్లు
- నైన్త్, టెన్త్ స్టూడెంట్స్ పై స్పెషల్ ఫోకస్
- ఆన్లైన్లో వర్క్ షీట్స్, రివిజన్ క్లాసుల నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్స్కూళ్లలో చదువుకునే పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం టీశాట్, దూరదర్శన్ వంటి చానెల్స్ద్వారా రికార్డెడ్ క్లాసులు చెప్పిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో స్కూళ్లు రీఓపెన్ అవ్వడంతో ఆన్లైన్ క్లాసులను ఆపేశారు. టీచర్లందరూ నేరుగా స్కూళ్లలోనే లెస్సెన్స్చెబుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో నెలాఖరు వరకు ప్రభుత్వం స్కూళ్లకు హాలిడేస్పొడిగించింది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే డౌట్తో సెప్టెంబర్లో ఆపేసిన క్లాసుల రికార్డింగ్ను తిరిగి ప్రారంభించింది. ఈ నెల 27 వరకు క్లాసులు రికార్డ్చేసేలా ఆఫీసర్లు ప్లాన్చేశారు. లెర్నింగ్ గ్యాప్తో ఎగ్జామ్స్ఎలా రాయాలా అని ఒత్తిడికి గురౌతున్న నైన్త్, టెన్త్క్లాస్పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. హాలిడేస్ఉన్నన్ని రోజులు సబ్జెక్ట్టీచర్లు డైలీ రెండు గంటలు ఆన్లైన్లో రివిజన్ క్లాసులు తీసుకుంటున్నారు.
ఆరు నుంచి పది వరకు
స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నుంచి సర్కారు స్కూళ్ల మేనేజ్మెంట్లకు గత మంగళవారం షెడ్యూల్ చార్ట్అందింది. అందులో క్లాస్ వైజ్గా సబ్జెక్టులో చెప్పాల్సిన చాప్టర్, లెస్సెన్స్ లిస్టుని, ప్రెజెంటర్ పేరు, స్కూల్ వివరాలు ఉంచారు. 27 తేదీ నుంచి రికార్డింగ్ సెషన్లు జరుగుతున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు టీచర్లు లెస్సెన్స్రికార్డ్ చేస్తున్నారు. వాటిని ఫ్యూచర్లో పరిస్థితిని బట్టి టీ–శాట్, దూరదర్శన్ ద్వారా టెలికాస్ట్ చేస్తారు. మున్ముందు డిజిటల్ క్లాసులే ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వారిపై స్పెషల్ ఫోకస్
ఓ వైపు క్లాసుల కోసం రికార్డింగ్ చేస్తూనే మరో వైపు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న నైన్త్, టెన్త్పిల్లలపై మేనేజ్మెంట్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. గూగుల్ మీట్ ద్వారా పిల్లలకు రివిజన్ క్లాసులు చెబుతూ, వర్క్ షీట్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగా స్కూల్ మేనేజ్మెంట్లు పిల్లలకు ట్యాబ్లు ప్రొవైడ్ చేశాయి. క్లాస్ టీచర్లు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి రోజువారీ షెడ్యూల్, టైమింగ్స్ ఇస్తున్నారు.
డైలీ 2 గంటలు రివిజన్ క్లాసులు
రెండేళ్ల నుంచి స్టూడెంట్స్ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ అవుతున్నారు. దానివల్ల పిల్లలకు చాలా లాస్ ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు ఎగ్జామ్స్ పెడతారని తెలుస్తోంది. టెన్త్ పిల్లలను మెంటల్గా స్ట్రాంగ్ చేస్తున్నాం. ప్రెజర్ ఫ్రీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పొడిగించిన హాలిడేస్ ను రివిజన్ కోసం ఉపయోగిస్తున్నాం. రోజుకు రెండు గంటలు ఆన్ లైన్లో రివిజన్ క్లాసులు పెడుతున్నాం. దీనివల్ల పిల్లలకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతోంది. - శారద, హెచ్ఎం, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, మాసబ్ ట్యాంక్