
దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ.100 తగ్గి రూ. 54,550గా కొనసాగుతోంది. మంగళ వారం ఈ ధర రూ. 54,650 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర కూడా రూ. 110 తగ్గింది. ప్రస్తుతం ఈ రేటు రూ. 59,510 గా ఉంది. మంగళవారం ఈ ధర రూ. 59,620 గా ఉంది.
హైదరాబాద్లో..
హైదరాబాద్లో బుధవారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,510గా నమోదైంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,660గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్59,510 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
వెండి స్థిరంగా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ.7,280గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 72,800గా కొనసాగుతోంది. మంగళవారం కూడా ఈ ధర రూ. 72,800గా ఉంది. కాగా హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.200 పెరిగి రూ.76,200 కి చేరింది. వెండి ధరలు కోల్కతాలో రూ.72,800 బెంగళూరులో రూ.71,500గా ఉంది.