తనఖా లోన్లు తగ్గుతున్నయ్​

తనఖా లోన్లు తగ్గుతున్నయ్​

అమెరికా బ్యాంకుల నిర్ణయాలు ఇండియా ఐటీ కంపెనీల ఆదాయాలను దెబ్బకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి బ్యాంకులు కాస్ట్​ కటింగ్​కు చాలా ఇంపార్టెన్స్​ ఇస్తున్నాయి. దీనివల్ల ఇండియా ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఐటీ మార్కెట్​కు 227 బిలియన్ డాలర్ల ఆదాయం రాగా వీటిలో 30 శాతం వాటా బ్యాంకింగ్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్​ అండ్​ ఇన్సూరెన్స్​(బీఎఫ్​ఎస్​ఐ) కంపెనీల నుంచే ఉంది. ఇవి ఇప్పుడు ఐటీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి.

న్యూఢిల్లీ:  ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో అమెరికా బ్యాంకులు అలర్టయ్యాయి. ఖర్చులకు కత్తెరేస్తున్నాయి. క్రెడిట్​లాస్​ ప్రొవిజన్లను పెంచుతున్నాయి. ఇది వరకే మార్జిన్లు తగ్గి ఇబ్బందిపడుతున్న ఇండియా ఐటీ కంపెనీలకు ఈ పరిస్థితి ఇబ్బందికరమే! బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్  ఇన్సూరెన్స్ (బీఎఫ్​ఎస్​ఐ) క్లయింట్లు భారతీయ ఐటీ మార్కెట్​కు ఎంతో కీలకం.  అమెరికాలో లెండింగ్​ లోన్ల తగ్గుదల కూడా భారతీయ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సేవల ఎగుమతిదారులకు నష్టాలు తేవొచ్చని ఎనలిస్టులు తెలిపారు. "పెద్ద యూఎస్​ బ్యాంకులు తమ ఆదాయం- దాదాపు 40శాతం (మొత్తం) వరకు ఐటీ సేవల కోసం ఖర్చు చేస్తాయి. ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇవి 'క్రెడిట్ లాస్' ప్రొవిజన్లను పెంచుతున్నాయి. ఇది వరకటి క్వార్టర్లలో మాదిరిగా పరిస్థితి లేదు. బ్యాంకులు పొదుపుపై శ్రద్ధ చూపుతున్నాయి " అని బ్రోకరేజ్ హౌస్ ఎలారా క్యాపిటల్ తెలిపింది. వెల్స్ ఫార్గో, గోల్డ్‌‌‌‌మన్ శాక్స్​,  మోర్గన్ స్టాన్లీ వంటి బ్యాంకులు నష్టాలు పెరగకుండా చూడటానికి ఖర్చులను తగ్గించుకుంటున్నాయని వివరించింది. పెద్ద యూఎస్​ బ్యాంకుల ఇటీవలి అభిప్రాయాలను (కామెంటరీ) కూడా ఇది ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

సత్తాను పెంచుకోవడంపై ఫోకస్​

వెల్స్ ఫార్గో 2023  క్యాలెండర్ సంవత్సరం బడ్జెట్.. ఆపరేషనల్​ సామర్థ్యం,  ఖర్చు తగ్గింపులపై దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. మరో యూఎస్​ బ్యాంకు గోల్డ్‌‌‌‌మన్ శాక్స్..​ కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతోపాటు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా బ్యాంకులు టెక్ ఖర్చులకు సంబంధించిన ఖర్చులను తగ్గించడం ఇండియా ఐటీకి నష్టదాయకమేనని  రుచి ముఖిజా, వైభవ్ చెచాని,  సీమా నాయక్ అనే ఎనలిస్టులు ఇటీవలి రీసెర్చ్​ నోట్‌‌‌‌లో తెలిపారు. "ఇది వరకే బ్యాంకులు ఖర్చులను తగ్గించుకున్నాయి. ఇన్వెస్ట్​మెంట్లపై నిర్ణయాలను పక్కనబెడుతున్నాయి. వచ్చే సంవత్సరం వరకు ఇలాగే ఉండొచ్చు. ఈ పరిస్థితులు ఇండియా మార్కెట్​కు ఇబ్బందే” అని రీసెర్చ్​ ఫర్మ్​ హెచ్ఎఫ్ఎస్​ చీఫ్ ఎనలిస్ట్ ఫిల్ ఫెర్ష్ట్ చెప్పారు.  భారతీయ ఐటీ కంపెనీలు బ్యాంకులకు డిజిటల్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్, కోర్-బ్యాంకింగ్ ప్రొడక్టులు,  కస్టమర్ ఎక్స్​పీరియెన్స్​ సేవలను అందిస్తాయి. లోన్ ఒరిజినేషన్‌‌‌‌తో సహా మార్జిగేజ్​ సాఫ్ట్‌‌‌‌వేర్ సేవలను కూడా అందిస్తాయి.

తనఖా లోన్లు తగ్గుతున్నయ్​

బీఎఫ్​ఎస్​ఐ వ్యాపారంలో తనఖా లోన్లు ఎంతో కీలకం. వడ్డీరేట్లు వీటికి ఎంతో ముఖ్యం. ఈ సంవత్సరం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పలుసార్లు మార్చింది. దీంతో యునైటెడ్ స్టేట్స్‌‌‌‌లో మొత్తం తనఖా లోన్లు జులై నాటికి (సంవత్సరానికి) 53.5 శాతం తగ్గాయి.  ఈ సెగ్మెంట్‌‌‌‌కు సేవలు అందించే భారతదేశ ఐటీ కంపెనీలపై ఇది తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. అన్ని టైర్–I టెక్ కంపెనీలు తమ  ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ల ద్వారా తనఖా లోన్​ సేవలను అందిస్తాయి. ఎలారా క్యాపిటల్ అంచనాల ప్రకారం, టైర్ 1 కంపెనీల జాబితాలో విప్రో,  ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తనఖా లోన్​ సాఫ్ట్​వేర్​ సేవలను అందిస్తున్నాయి. టైర్ 2 కంపెనీల్లో ఎంఫాసిస్ ఈ సెగ్మెంట్‌‌‌‌పై పనిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడటానికి ఈ కంపెనీ ముందుకు రావడం లేదు. “2008–-09 (గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్) మాదిరిగా, తనఖా లోన్లు తగ్గడం వల్ల భారతీయ సర్వీస్ ప్రొవైడర్లపై ఎఫెక్ట్​ఉంటుంది. ప్రభావం నెమ్మదిగా ఉంటుంది.  సమీప కాలానికి లోన్ల సంఖ్య తగ్గుతుంది" అని హెచ్​ఎఫ్​ఎస్​కు చెందిన ఫెర్ష్ట్ చెప్పారు.