తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబానీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబానీ

రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి స్వామి వారి నిజపాద సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈవో ధర్మారెడ్డి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. దర్శనం చేసుకున్న అనంతరం అంబానీ గజరాజుల ఆశీర్వచనం తీసుకున్నారు. గోశాల వద్దకు వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం శ్రీ వారి ఆలయం అభివృద్ధి చెందుతోందని, స్వామి వారి ఆశీస్సులు ప్రతొక్కరికి ఉండాలన్నారు. ముఖేష్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే... తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా ఉన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.