- లాభం రూ. 12,273 కోట్లు
- రెవెన్యూ రూ. 1.44 లక్షల కోట్లు
- జియో లాభం రూ. 2,519 కోట్లు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం జూన్ 2021తో ముగిసిన క్యూ1లో 7.2 శాతం తగ్గి రూ. 12,273 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ1లో కంపెనీ నికర లాభం రూ. 13,233 కోట్లు. అయితే మార్చి 2021 క్వార్టర్తో పోలిస్తే మాత్రం నికర లాభం 13 శాతం పెరిగి రూ. 10,845 కోట్లకు చేరింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి క్వార్టర్లో రెవెన్యూ రూ. 1.44 లక్షల కోట్లకు పెరిగింది. అయిల్ టూ కెమికల్ బిజినెస్ గ్రోత్ క్యూ1లో బాగుండగా, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో రిటెయిల్ బిజినెస్ కొంత దెబ్బతింది. సెకండ్వేవ్ ఎఫెక్ట్ పడినప్పటికీ మంచి పనితీరునే సాధించగలిగామని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. బీపీతో కలిసి కేజీ డీ6లో ప్రొడక్షన్ మొదలు పెట్టామని, దేశపు గ్యాస్ ప్రొడక్షన్లో 20 శాతం తాము సమకూరుస్తున్నామని అన్నారు.
జియో లాభం పెరిగింది...
ఆర్ఐఎల్ సబ్సిడరీ జియో లాభం క్యూ1లో 45 శాతం పెరిగి రూ.3,651 కోట్లయింది. ఇదే క్వార్టర్లో ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పు) రూ. 138.4 వద్ద నిలిచింది. ఇక రిలయన్స్ రిటెయిల్ రెవెన్యూ 21.9 శాతం పెరిగి రూ. 38,547 కోట్లకు చేరింది. పెట్రో రిటెయిలింగ్ బిజినెస్ రెవెన్యూ అడ్జస్ట్మెంట్ తర్వాత చూస్తే రిటెయిల్ రెవెన్యూ 32 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. కరోనా సెకండ్వేవ్ రెస్ట్రిక్షన్లు ఆపరేషన్స్, ప్రాఫిటబిలిటిలపై ప్రభావం చూపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. చిన్న మర్చంట్స్తో పార్ట్నర్షిప్స్ కుదుర్చుకుంటున్నామని, కన్జూమర్లతో డిజిటల్ ఎంగేజ్మెంట్ పెరుగుతోందని...దీంతో ఫ్యూచర్లో రిటెయిల్ బిజినెస్ మరింత గ్రోత్ సాధిస్తుందనే విశ్వాసాన్ని ముకేశ్ అంబానీ వ్యక్తం చేశారు.