న్యూఢిల్లీ: ఎనిమిది యూఎస్ ప్రొడక్ట్ల దిగుమతులపై అదనంగా వేసిన సుంకాలను ఇండియా ఎత్తేయనుంది. యూఎస్ మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న స్టీల్, అల్యూమినియం ప్రొడక్ట్లపై టారిఫ్లను 2018 లో పెంచింది. దీనికి రెస్పాన్స్గా ఇండియా కూడా యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్, పప్పులు, బఠాణీలు, ఆల్మాండ్స్, వేరుశెనగ, బోరిక్ యాసిడ్ వంటి 28 ప్రొడక్ట్లపై అదనంగా సుంకాలు వేసింది.
ఇందులో ఎనిమిదింటిపై ఇంకో 90 రోజుల్లో అదనపు టారిఫ్లను ఎత్తేయనున్నారు. ఆరు డబ్ల్యూటీఓ గొడవలను పరిష్కరించుకోవాలని తాజాగా ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి.