
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: స్టేట్లో టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు ఫంక్షన్ హాల్స్గా మారనున్నాయి. గతేడాది రైతు వేదికల నిర్మాణాలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసర్లు, సర్పంచులు అందరిపై ఒత్తిడి పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా నవంబర్నాటికి చిన్నచిన్న పనులు మినహా బిల్డింగ్లను మాత్రం పూర్తి చేశారు. రైతు వేదికలను నిర్మించారు కానీ మెయింటెనెన్స్కు టీఆర్ఎస్ సర్కార్ ఫండ్స్ఇవ్వలేదు. మెయింటెనెన్స్డబ్బుల కోసం రైతు వేదికలను కార్యక్రమాలకు అద్దెకిచ్చుకోవాలని సర్కార్ మౌఖిక ఆదేశాలను జారీ చేసినట్టుగా అగ్రికల్చర్ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
చేతులెత్తేసిన పంచాయతీలు
రాష్ట్రంలో 2,604 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో జిల్లాలో 40 నుంచి 80 వరకు రైతు వేదికలను సర్కార్ నిర్మించారు. ఇందుకుగానూ ఉపాధిహామీ పథకం, అగ్రికల్చర్ నుంచి ఒక్కో రైతు వేదికకు రూ. 22 లక్షలను గవర్నమెంట్ కేటాయించింది. ఇందులో భాగంగానే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 67 రైతు వేదికలను నిర్మించాలని ఆఫీసర్లు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో కనీసం రెండు మూడింటినైనా గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించాలని ఆఫీసర్లు ప్లాన్ చేశారు. కానీ అనుకున్నట్టుగా పనులు కాలె. అక్టోబర్ చివరినాటికి చిన్నచిన్న పనులు మినహాయిస్తే బిల్డింగ్లను మాత్రం ఆఫీసర్లు పూర్తి చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉండటంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. వేదికలను తొందరగా పూర్తి చేయాలని వేధించిన ఆఫీసర్లు బిల్లులు ఇవ్వమని అడిగితే మాత్రం సర్కారు నుంచి డబ్బులు రాలేదని చెప్పి తప్పించుకుంటున్నారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
బిల్డింగ్ పనులు పూర్తి చేసినప్పటికీ నీళ్ల కోసం బోర్, ప్రహరీ, మొక్కల పెంపకం వంటి ఇతరత్రా వాటికి ఫండ్స్ లేకపోవటంతో ఆ భారాన్ని సర్కార్ పంచాయతీల మీద వేసింది. చిన్న పంచాయతీలైతే మేం ఫండ్స్ కేటాయించలేమంటూ చేతులెత్తేశాయి. దీంతో పలుచోట్ల నీటి సౌకర్యం లేకుండాపోయింది. రైతు వేదికలను నిర్మించాలని చెప్పిన సర్కార్ వాటి మెయింటెనెన్స్కు మాత్రం ఒక్క పైసా కేటాయించలేదు. ఇప్పటికే కొన్ని రైతు వేదికలకు కరెంటు బిల్లులు వచ్చాయి. గవర్నమెంట్ ఫండ్స్ కేటాయించకపోవడంతో మేం ఎక్కడి నుంచి కరెంటు బిల్లులు కట్టాలంటూ అగ్రికల్చర్ ఆఫీసర్లు వాపోతున్నారు. మరోవైపు వేదికలను ఊడ్చటం, మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ వర్కర్ అవసరం ఉంది. వర్కర్ను పెట్టుకుని పంచాయతీ ఫండ్స్నుంచే జీతం ఇయ్యాలంటూ సర్కార్ మౌఖికంగా పేర్కొంటుండంతో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు వేదికలను ఫంక్షన్స్, మీటింగ్లు, ఇతర ప్రోగ్రాంలకు అద్దెకిచ్చుకోండంటూ సర్కార్ మౌఖిక ఆదేశాలను అగ్రికల్చర్ఆఫీసర్లకిచ్చింది. దీంతో మెయింటెనెన్స్పైసల కోసం వేదికలను ఆఫీసర్లు ఫంక్షన్ హాల్స్గా మార్చనున్నారు. ఆ మండలంలో ఉన్న డిమాండ్ఆధారంగా రోజుకింతని అద్దె నిర్ణయించనున్నారు.