
శివారెడ్డి, అమిత్ తివారి హీరోలుగా నటిస్తున్న హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్ "రెంట్". "నాట్ ఫర్ సేల్" అన్నది ఉప శీర్షిక. రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో చందక రాజ్ కుమార్, సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్యప్రియ, దర్శకుడు రఘువర్థన్ రెడ్డి, నిర్మాతలు చందక రాజ్ కుమార్, సి.హెచ్.రామ్ నాథ్, సినిమాటోగ్రాఫర్ హజరత్ (వలి), సంగీత దర్శకులు డి.ఎస్.ఆర్ పాల్గొన్నారు. వారు ఈ చిత్ర విశేషాలు వెల్లడించారు. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని నటీనటులు తెలిపారు. గోవాలో జరిగే మూడో షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని నిర్మాత చందక రాజ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బాలాజీ శ్రీను, కో - డైరెక్టర్: దాసరి గంగాధర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: డి.ఎస్.ఆర్, సినిమాటోగ్రఫీ: హజరత్ (వలి), నిర్మాతలు: చందక రాజ్ కుమార్ - సి.హెచ్.రామ్ నాథ్, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్సకత్వం: రఘువర్ధన్ రెడ్డి.