
కరోనాను ఎదుర్కునేందుకు దేశ ప్రజలకు మరో కీలక సూచన చేశారు ప్రధాని మోడీ. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఎవరు ఎక్కడున్నా అందరూ విద్యుత్ లైట్లు ఆపేసి దీపాలు వెలిగించాలన్నారు. కరోనా చీకట్లను తరిమేయాలన్నారు. కొవ్వొత్తి, దీపం, లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయాలన్నారు. దేశ ప్రజలు సంకల్ప శక్తిని వెలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ వీడియో సందేశమిచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన మోడీ ..దేశమంతా ఒక్కటై కరోనాపై యుద్ధం చేస్తున్నామని.. ఇంకా చేయాలన్నారు. చాలా దేశాలు మన లాక్ డౌన్ ను పాటిస్తున్నాయన్నారు. భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనన్నారు. స్వీయనియంత్రనలో ఉన్నా అందరం ఒక్కటేనని నిరూపించాలన్నారు.
#WATCH PM Modi: I also appeal to people to avoid gathering anywhere during this period (on 5th April at 9 PM). You don't have to go out on the streets and in the colonies, but do it from your doorsteps and balconies. pic.twitter.com/QX2fH91wzf
— ANI (@ANI) April 3, 2020