బ్యాంక్ వడ్డీ రేట్లు ఏం మారలేదు.. అలాగే ఉన్నాయి : ఆర్బీఐ

బ్యాంక్ వడ్డీ రేట్లు ఏం మారలేదు.. అలాగే ఉన్నాయి : ఆర్బీఐ

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేటును 6.5 శాతంగా ఉంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా  సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగాయి.  ఈ సమావేశంలో ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ  కీలక నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. ధరలను అదుపు చేసేందుకు, ఆహార వస్తువుల ధరలు పెరుగుతుండటంతో RBI ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను కూడా పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడికి 2022 మే నుంచి 2023 ఫిభ్రవరి మధ్య కాలంలో కీలక వడ్డీ రేట్లను 250 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.