పెన్షన్ పెంచాలని ఢిల్లీలో దీక్ష

పెన్షన్  పెంచాలని ఢిల్లీలో దీక్ష

వనపర్తి, వెలుగు: ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసి రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్ పై డీఏ పెంచాలని రిటైర్డ్  ఆర్టీసీ ఉద్యోగులు శుక్రవారం డిల్లీలోని జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈపీఎస్- 95 పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమతి అధ్యక్షుడు అశోక్ రావత్ కు మద్దతుగా తాము ఢిల్లీలో నిరసన చేపట్టామని ఆర్టీసి రిటైర్డ్​ ఎంప్లాయీస్  వెల్ఫేర్  అసోషియేషన్  రాష్ట్ర నాయకుడు సత్తన్న తెలిపారు.

కనీస పెన్షన్  పెంపు కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. డిమాండ్ల సాధన కోసం తమ జాతీయ అధ్యక్షుడు ఆమరణ దీక్ష చేపట్టగా వనపర్తికి చెందిన అసోషియేషన్ నాయకులు గోపాల్ రెడ్డి, బాలయ్య, సత్యం, స్వామిగౌడ్  మద్దతు తెలిపారు.