317 జీవోను వెంటనే రద్దు చేయాలి

317 జీవోను వెంటనే రద్దు చేయాలి

హైదరాబాద్ : ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన టీచర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. పండగ రోజున చర్చలు జరపకుండా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే పరిష్కరించాలన్న రేవంత్.. ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులకు భంగం కలిగిస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీచర్ల పోరాటం మరువలేనిదన్న రేవంత్ వారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. 317 జీవోను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

FOR MORE NEWS..

కోవిడ్ను జయించిన పసిపాప

భారత సైన్యానికి కొత్త యూనిఫాం