తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

తిరుమల శ్రీవారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్ 12న దర్శించుకున్నారు.  ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. ర్శనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర, తెలంగాణలో మానవ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసికట్టుగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు.