హైదరాబాద్, వెలుగు: ఏఐ గవర్నెన్స్, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ అందించే ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ లిమిటెడ్ శుక్రవారం తన షేర్లను బీఎస్ఈలో లిస్టింగ్ చేసింది. స్టాక్మార్కెట్లోకి వచ్చిన మొదటి ఏఐ కంపెనీ తమదేనని ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ ఎండీ, సీఈఓ రాజా శ్రీనివాస్ నందిగామ తెలిపారు.
మనదేశంలో పాలన, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫార్మేషన్కు ఏఐ వెన్నెముకగా మారాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ రివర్స్ మెర్జింగ్ ద్వారా మెయిన్బోర్డులో లిస్టింగ్ అయింది.
2023లో ఆర్ఎన్ఐటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్, ఆటోపాల్ ఇండస్ట్రీస్లో విలీనం అయింది. కంపెనీ పేరు ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్గా మారింది. ఇది ఏఐ ఆధారిత ఫేషియల్, బెనిఫిషియరీ ట్రాకింగ్ సిస్టమ్లను డెవెలప్ చేసింది.
