కారు ఢీకొట్టడంతో ఎగిరిపడ్డ బైక్.. ఒకరు మృతి

కారు ఢీకొట్టడంతో ఎగిరిపడ్డ బైక్.. ఒకరు మృతి

వనపర్తి జిల్లా పెబ్బేర్ జాతీయ రహదారిపై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.  స్థానిక వల్లపురెడ్డి  జంక్షన్ లో ఓ పంక్షన్ కు హాజరై  బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ నుండి కర్నూలు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వేగంగా వెళ్తున్న కారు బైక్ ను డీ కొట్టడంతో బైక్ 30మీటర్ల దూరంలో పడి కాలిపోయింది. బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు రవి యాదవ్, హరీష్ లు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిద్దరిని వనపర్తి ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి యాదవ్ మృతి చెందాడు.  హరీష్ చికిత్స పొందుతున్నాడు. కారు లో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప  గాయాలయ్యాయని పెబ్బేర్ ఎస్ఐ విజయ్ కుమార్ తెలియజేశారు.