రోడ్డు ప్రమాదమే ప్రయాణికులను కాపాడింది

రోడ్డు ప్రమాదమే ప్రయాణికులను కాపాడింది

ఎక్కడైనా సరే..రోడ్డు ప్రమాదం ప్రయాణికుల ప్రాణాలు తీస్తుంది. కానీ ఏపీలో రోడ్డు ప్రమాదమే ప్రయాణికులను కాపాడింది. శ్రీశైలం నుంచి మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. క్షణాల్లో ఆ బస్సు పక్కన ఉన్న లోయలో పడాలి. కాని అంతలోనే ముందు నుంచి వస్తున్న ఓ లారీ ఆ బస్సును ఢీకొట్టింది. అంతే...క్షణాల్లో రోడ్డుపైనే ఆగిపోయింది బస్సు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్టారు. లారీ బస్సును ఢీకొట్టడమే మంచిదైందని అంతా సంతోషం వ్యక్తం చేశారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు పక్క భాగం, లారీ ముందు భాగం మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి.