
లండన్: ఇండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మరోసారి ‘హండ్రెడ్’ టోర్నీలో బరిలోకి దిగనుంది. ఈ మేరకు నార్తర్న్ సూపర్ చార్జర్స్తో చివరి నిమిషంలో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా హీథర్ గ్రాహమ్ ప్లేస్లో రోడ్రిగ్స్ ఆడనుంది. స్టార్టింగ్ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచిన రోడ్రిగ్స్ రిస్ట్ ఇంజ్యు రీ కారణంగా గతేడాది టోర్నీలో ఆడలేదు. ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన ఆసీస్ ప్లేయర్లు అలీసా హీలీ, ఎలిసా పెర్రీ ఈ టోర్నీకి దూరమయ్యారు. హండ్రెడ్లో ఆడుతున్న నాలుగో ఇండియన్ ప్లేయర్ రోడ్రిగ్స్. ఇప్పటికే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, రిచా ఘోష్ ఈ టోర్నీలో ఆడుతున్నారు.