హెచ్ ఆర్ సీని ఆశ్రయించిన రౌడీ షీటర్ రియాజ్ ఫ్యామిలీ

హెచ్ ఆర్ సీని ఆశ్రయించిన రౌడీ షీటర్ రియాజ్ ఫ్యామిలీ

నిజామాబాద్, వెలుగు:  నిజామాబాద్ లో పోలీస్​ఎన్​కౌంటర్​మరణించిన రౌడీ షీటర్ రియాజ్​కుటుంబీకులు సోమవారం రాష్ట్ర హ్యూమన్​ రైట్స్​కమిషన్​ ను  ఆశ్రయించారు. రియాజ్ తల్లితో పాటు అతని భార్యాపిల్లలు హెచ్ఆర్ సీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. మహిళలు, పిల్లలని చూడకుండా పోలీసులు  థర్డ్ ​డిగ్రీ ప్రయోగిస్తున్నారని, వేధింపులు, నిర్భంధం ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. 

రియాజ్​ను ఎన్​కౌంటర్​ చేశాక తమను సిటీలోకి రానివ్వడంలేదని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని వాపోయారు. రియాజ్​పై నమోదైన ఓ కేసులో కానిస్టేబుల్ ​ప్రమోద్​కుమార్​కు మధ్య ఆర్థిక పరమైన గొడవలు ఉన్నాయని చైర్మన్ కు వివరించారు. రియాజ్​ను ఎన్​కౌంటర్​ చేసి తమ కుటుంబాన్ని దుర్భరంగా మార్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న హెచ్ ఆర్ సీ చైర్మన్ షమీమ్​ అక్తర్​ నవంబర్​3లోపు నివేదిక ఇవ్వాలని డీజీపీ శివధర్​రెడ్డిని ఆదేశించారు.