అమెరికాలో ఆర్ఆర్ఆర్ టీం సందడి

అమెరికాలో ఆర్ఆర్ఆర్ టీం సందడి

అంతర్జాతీయ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా చాటుతోంది. ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా మార్చి 3వ తేదీ శుక్రవారం లాస్ ఏంజెల్స్‌లోని ది ఏస్ హోటల్‌లో మూవీని ప్రదర్శించారు. అమెరికా అంతటా రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 95వ అకాడమీ అవార్డ్స్‌కు ముందు మూవీ రిలీజ్ రావటంతో.. అందులోని యాక్టర్స్ అందరూ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. ది ఏస్ హోటల్ లో ట్రిబుర్ మూవీ షోకు.. దర్శకుడు రాజమౌళి, రాంచరణ్, కీరవాణి హాజరయ్యారు.  సినిమాను చూసిన అమెరికా ప్రేక్షకులు మైమరిచిపోయారు.. మనోళ్లకు  స్టాండింగ్ ఒవేషన్ (నిలబడి చప్పట్లు) ఇచ్చారు. ఇండియన్ యాక్టర్స్ కు ఇలాంటి గౌరవం దక్కటం.. అమెరికాలో ఇదే మొదటిసారి కావటం విశేషం.

ప్రేక్షకుల అభిమానానికి ముగ్దులు అయిన టీం.. అభిమానుల దగ్గరకు వచ్చి సెల్ఫీలు ఇచ్చారు. రాంచరణ్ అయితే ఆడియన్స్ మధ్యకు వచ్చి సందడి చేశారు. వాళ్లతో ఫొటోలు దిగుతూ ఉత్సాహపరిచారు. అమెరికాలో ఇంతటి ఆదరణ రావటం ఆనందంగా ఉందని.. జీవితంలో మర్చిపోలేని ఘటన అంటూ ఎమోషన్ అయ్యారు చెర్రీ.

ట్రిబుల్ ఆర్ లోని నాటు నాటు పాట ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతుంది. నామినేషన్స్ లో చోటు దక్కించుకోవటమే కాకుండా.. అవార్డ్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో.. అమెరికాలో ట్రిబుల్ ఆర్ మూవీని రీ రిలీజ్ చేశారు. ప్రతి రోజూ ఏదో ఒక థియేటర్ దగ్గర చిత్ర బృందం ప్రమోషన్ చేయటంతోపాటు.. అభిమానులతో కలిసి సందడి చేస్తుంది. మార్చి 13వ తేదీన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు.. అప్పటి వరకు టీం మొత్తం అక్కడే ఉండనుంది.. తారక రత్న మరణంతో.. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉండిపోయారు.. ఒకటి, రెండు రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు.