
హైదరాబాద్ సిటీ, వెలుగు: జవహర్నగర్ డంపింగ్ యార్డులోని రాంకీ పవర్ప్రాజెక్టు పనుల్లో లిఫ్ట్తెగిపడి చనిపోయిన ముగ్గురు కార్మికులకు జీహెచ్ఎంసీ మేయర్గద్వాల్ విజయ లక్ష్మి రూ.15 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె శానిటేషన్ ఆఫీసర్లు, రాంకీ ప్రాజెక్ట్యాజమాన్యంతో సమావేశమయ్యారు. పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్నిబంధనల ప్రకారం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.15 లక్షలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.4 లక్షలు మంజూరు చేశామన్నారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, రాంకీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అగర్వాల్ పాల్గొన్నారు. అయితే రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే లిఫ్ట్కూలిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.