రూ.8 లక్షల ఫ్లాట్ బిల్డర్‌కు రూ.48 లక్షల ఫైన్

రూ.8 లక్షల ఫ్లాట్ బిల్డర్‌కు రూ.48 లక్షల ఫైన్

ముంబై : రూ.8 లక్షల ఫ్లాట్‌ను డెలివరీ చేయనందుకు కస్టమర్‌కి రూ.48 లక్షలు చెల్లించాలని బిల్డర్‌ని నేషనల్ కన్జూమర్ కమిషన్ ఆదేశించింది. నవి ముంబైలో ఆర్‌కే సింఘాల్ అనే వ్యక్తి 25 ఏళ్లక్రితం సుద్రధ్ కన్‌‌స్ట్ర క్షన్ లిమిటెడ్‌ వద్ద రూ.8.2 లక్షలకు ఒక ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నాడు. కానీ బిల్డ ర్ మాత్రం ఆ వ్య క్తికి అసలు ఫ్లాట్‌ను డెలివరీ చేయలేదు. దీంతో ఆయన కన్జూమర్ కమిషన్‌‌ను ఆశ్రయించాడు. 2015లో స్టేట్ కన్జూమర్ కమిషన్ ఇచ్చిన11 శాతం వడ్డీఅంటే రూ.39.4 లక్షలకు ప్రిన్సిపల్ అమౌంట్ రూ.8.2 లక్షలను కూడా కలుపుకు ని సింఘాల్‌‌కు చెల్లించాలని బిల్డ ర్‌ను నేషనల్ కన్జూమర్ కమిషన్ ఆదేశించింది. మొత్తంగా రూ.47.6 లక్షల అమౌంట్‌ను సుద్ర‌‌కన్‌‌స్ట్రక్షన్‌‌45 రోజుల్లో సింఘాల్‌‌కు చెల్లించాలని తెలిపింది. ఒకవేళ అమౌంట్ ‌కట్టడంలో విఫలమైతే ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి పేమెంట్ జరిపే వరకు ప్రతేడాది 6 శాతం వడ్డీని జరిమానాగా వేస్తామని కమిషన్ హెచ్చరించింది.

2015లో స్టేట్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై సింఘాల్‌‌ నేషనల్ కన్జూమర్ డిస్పూట్స్ రిడ్రెషల్ కమిషన్‌‌ను ఆశ్ర యించాడు. పరిహారం ఇప్పించేందుకు స్టేట్‌ కమిషన్ ఆమోదించిందని, కానీ 2014లో పూర్తయిన తన ఫ్లాట్‌ను ఇప్పించడంలో విఫల మైందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే స్టేట్ కమిషన్ ఇచ్చిన తీర్పును నేషనల్ కమిషన్ స్వాగతించింది. 2001లో స్టేట్ కమిషన్ ముందుకు ఈ కంప్లయింట్ వచ్చినప్పు డు, సింఘల్ కేవలం తాను కట్టిన అమౌంట్‌నే రీఫండ్‌గా కోరారని పేర్కొంది. 2015 జూన్‌‌లో ఆయన కంప్లయింట్‌పై విచారణ ఫైనల్ స్టే జీల్ ఉండగా.. ఫ్లాట్‌ కూడా కోరడం అతను ప్రారం భించాడని తెలిపింది. బిల్డ ర్‌కు తన వ్రాతపూ ర్వక స్టేట్‌మెంట్‌ను రివైజ్ చేసే ఛాన్స్ ఉంటే, సింఘాల్ ఫిర్యాదు సవరణకు అనుమతించవ చ్చని నేషనల్ కమిషన్ పేర్కొంది. కానీ ప్రస్తుత కేసులో ఫిర్యాదు సవరణ కుదరదని తెలిపింది.