కొత్తగూడెం గవర్నమెంట్ జూనియర్కాలేజీ రిపేర్లకు రూ.58 లక్షలు : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

 కొత్తగూడెం గవర్నమెంట్ జూనియర్కాలేజీ రిపేర్లకు రూ.58 లక్షలు : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీలో రిపేర్లకు రూ. 58లక్షలను ప్రభుత్వం సాంక్షన్​ చేసిందని కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ తెలిపారు. మంగళవారం కాలేజీని ఆయన సందర్శించారు. ప్రాక్టికల్​ ల్యాబ్స్​ రిపేర్లు, ఎలక్ట్రికల్​, కంప్యూటర్​ ల్యాబ్​కు సామగ్రి, వాటర్​ పైప్​ లైన్స్​, సీలింగ్​ ఫ్యాన్లకు ఈ నిధులు వినియోగించాలని సూచించారు. 

మైనర్​ రిపేర్లకు సంబంధించి ఎస్టిమేషన్​ తయారు చేయాలన్నారు. కాలేజీ ఆవరణలో ఉన్న చుంచుపల్లి గవర్నమెంట్​ హైస్కూల్​కు సంబంధించి పాత తరగతి గదుల రిపేర్లతో పాటు కిషన్​ షెడ్డును పరిశీలించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో కాలేజీ ప్రిన్సిపాల్​ కత్తి రమేశ్, ఇంటర్మీడియట్​ ఇన్​చార్జ్​ జిల్లా ఆఫీసర్​ సులోచనా రాణి, పీఆర్​ఈఈ శ్రీనివాస్​ పాల్గొన్నారు. 

చేపల తలలతో రుచికరమైన సూప్​ 

చేపల తలలు, ఇతర భాగాలతో రుచికరమైన సూప్​ తయారు చేసి జిల్లా వాసులకు అందించడం ద్వారా ఆరోగ్యం, ఆదాయం పొందవచ్చని కలెక్టర్​ జితేశ్​ సూచించారు. బోన్​లెస్​ చేపల ద్వారా పోషకాహారం, ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫిష్​ వ్యాపారులు, మత్స్యకారులతో కలెక్టరేట్​లో మంగళవారం సమావేశం నిర్వహించారు. చేపల్​ బోన్​ లెస్​ కట్​ విధానంపై కలెక్టర్​ డెమో ఇచ్చారు. చేపలను బోన్​ లెస్​గా తయారు చేయడం ద్వారా మార్కెట్​లో వాటి విలువ పెరుగుతోందని ఆయన తెలిపారు.