మేడిగడ్డ కుంగడం వెనుక అసాంఘిక శక్తులు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

మేడిగడ్డ కుంగడం వెనుక అసాంఘిక శక్తులు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గద్దె దించడం కోసమే  కాంగ్రెస్​, బీజేపీ కలిసి కుట్ర చేశాయి: ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ 
  • రేవంత్​, బండి సంజయ్​, కిషన్‌‌‌‌రెడ్డి పాత్రపై  పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గద్దె దింపడం కోసం మేడిగడ్డపై  కాంగ్రెస్​, బీజేపీ కలిసి కుట్ర పన్నాయని బీఆర్ఎస్​ నేత, మాజీ ఐపీఎస్​ఆఫీసర్​ ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ ప్రవీణ్‌‌‌‌ కుమార్​ ఆరోపించారు. మేడిగడ్డ కుంగినప్పుడు భారీ శబ్దాలు వచ్చాయంటూ మహదేవ్‌‌‌‌పూర్​ పోలీస్​స్టేషన్‌‌‌‌లో ఏఈఈ ఫిర్యాదు చేశారని, బ్యారేజీ కుంగడం వెనుక అసాంఘిక శక్తులున్నాయని ఆయన పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటివరకు ఆ అసాంఘిక శక్తులెవరో గుర్తించలేదని అన్నారు. మేడిగడ్డలో కేవలం ఒక్క పిల్లరే ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు.

కుంగితే అంత పెద్ద శబ్దాలు రావని అన్నారు. పేలుళ్లు జరిగితేనే అంత పెద్ద శబ్దం వస్తుందని, ఎన్‌‌‌‌డీఎస్ఏ ఆ కోణంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. శనివారం  తెలంగాణ భవన్‌‌‌‌లో  ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ మీడియాతో మాట్లాడారు. మహదేవ్‌‌‌‌పూర్​ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి.. ఆ అసాంఘిక శక్తులు రేవంత్‌‌‌‌రెడ్డి, బండి సంజయ్​, కిషన్‌‌‌‌రెడ్డిలేమో తేల్చాలని డిమాండ్​ చేశారు. ఆ ముగ్గురి ఫోన్ల డేటాను చెక్​ చేస్తే వెంటనే తెలిసిపోతుందని అన్నారు. వారిపై సిట్​వేసి.. విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. 

పేలుళ్ల కోణంలో దర్యాప్తు జరగలే

కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసే కుట్ర చేశారని ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ ప్రవీణ్ కుమార్​ ఆరోపించారు. పేలుళ్ల కోణంలో విచారణ జరగలేదని అన్నారు. అసలు అక్కడ చిన్న చిన్న భూకంపాలేమైనా వచ్చాయా? అన్నది తేల్చాలని కోరారు. మేడిగడ్డపై స్క్రిప్ట్​ రాసిచ్చిన డ్రామాలాగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్‌‌‌‌రెడ్డి ఆంధ్రా పెట్టుబడిదారుల ఏజెంట్​ అని విమర్శించారు. సీఎం రమేశ్​ కంపెనీకి ఫోర్త్ సిటీలో కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. రేవంత్​ వెనుక20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉన్నట్టు స్వయంగా కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డే చెప్పారని ప్రవీణ్​కుమార్​అన్నారు.