సరూర్ నగర్లో నిర్వహించిన సకల జనభేరీ సభలో ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ డిపోకు చెందిన నంగూనూరి బాబు అనే ఆర్టీసీ డ్రైవర్ సభకు వచ్చాడు. అక్కడ గుండెపోటు రావడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. బాబుది బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామం. బాబుకు ఇద్దరు కూతుళ్లు. 25 సంవత్సరాలు గా ఆర్టీసీ లో డ్రైవర్ గా బాబు పనిచేస్తున్నారు.
డ్రైవర్ బాబు మృతిపై స్పందించిన జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి సకల జనభేరి సభలో బాబుకు గుండెపోటు రావడం అందరినీ కలిచివేసిందన్నారు. బాబుది ప్రభుత్వ 16 వ హత్యగా అని అన్నారు. కార్మికులు ఎవరు అధైర్యపడద్దని.. జేఏసీ అండగా ఉంటుందన్నారు. 31న కరీంనగర్ కు బంద్ కు పిలుపునిస్తున్నామన్నారు.