రోశయ్య అజాత శత్రువు.. ఆయన మరణం తీరనిలోటు

రోశయ్య అజాత శత్రువు.. ఆయన మరణం తీరనిలోటు

మాజీ సీఎం రోశయ్య గారి మరణం చాలా బాధాకరమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. రోశయ్య అజాత శత్రువు అని, ఆయన మరణం తీరనిలోటని ఆయన వాపోయారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కు బాగా సపోర్టుగా ఉన్న సీఎం రోశయ్య అని సజ్జనార్ కొనియాడారు.  తాను 2006లో గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు అమరావతిలో బౌద్ధ ధర్మ కళాచక్రం అనే చాలా పెద్ద కార్యక్రమం జరిగిందని.. అది సక్సెస్ చేసినందుకు రోశయ్య తనను ఇంటికి పిలిచి అభినందించారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నపుడు కూడా డిపార్ట్మెంట్ కు చాలా నిధులు ఇచ్చేవారని అన్నారు. ఆర్టీసీ తరపున నివాళులర్పించిన ఆయన.. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.