
కరోనా పీరియడ్ ముగిసిన తర్వాత తెలుగు తెరకు కొత్త నటీనటులు, కొత్త సాంకేతిక నిపుణులతో సహా కొత్త కథలతో వెండి తెర కొత్త పుంతలను తొక్కుతుందని చెప్పాలి. ఈ మధ్య చూసినట్లయితే సినిమా ప్రేక్షకుల అభిరుచి కూడా మారిందని సుస్పష్టంగా తెలుస్తుంది. సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రేక్షకులు కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి తగ్గట్లుగా నవ యువ రచయితలు కొత్త కథలతో ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో 'రుద్రప్ప' టీజర్ ఎంతో కొత్తదనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఎస్ఎంఎల్ ప్రొడక్షన్ సమర్పణలో, హేమంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'రుద్రప్ప' మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన యువ నటుడు రమేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి డీఓపి మరియు ఆర్ట్ డైరెక్టర్ గా సుధీర్ పి.ఆర్ వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా భరత్ సంగీతం సమకూరుస్తుండగా, ఈ సినిమాకు సహదర్శకుడుగా భరత్ ప్రమోద్, సౌండ్ డిజైనర్ గా హులివన్ నాగరాజ్ పనిచేస్తున్నారు.
పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ డ్రామాతో పాటు ఎమోషన్ సెంటిమెంటల్ మూవీగా తెరకెక్కుతున్న రుద్రప్ప ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రయోగాత్మకమైన చిత్రంగా తెరకెక్కుతుంది. టీజర్ చూసినట్లయితే.. చాలా ఇంటెన్సీగా కనిపిస్తుంది. "అమ్మ నేను ఏ తప్పు చేయలేదు" అని హీరో క్యారెక్టర్ అంటుంటే "నువ్వు చేసిన తప్పుకు శిక్ష పడేదాకా చావద్దు" అని తల్లి క్యారెక్టర్ చెప్పడం చూస్తుంటే ఈ సినిమా కథాంశం చాలా వినూత్నంగా ఉంటుందని తెలుస్తుంది.
చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం రుద్రప్ప సినిమా ఇంకా కొన్ని వారాల్లో రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది అని, అతి త్వరలోనే సినిమాను పూర్తి చేసుకొని ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకమైన కొత్త కథలను ఎప్పుడూ స్వాగతించే తెలుగు ప్రేక్షకులు రుద్రప్ప సినిమాని స్వాగతించి, మంచి విజయం అందిస్తారన్న నమ్మకంతో ఉన్నట్లు చిత్ర యూనిట్ మొత్తం తెలిపారు.