కూకట్ పల్లి, వెలుగు: భరత్ నగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న ప్యాసింజర్లకు సీఆర్పీఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ వస్తే ప్రాణాలు కొల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రూల్స్ బ్రేక్ చేసి పట్టాలు దాటితే రూ. వెయ్యి ఫైన్ తో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు.