ఇద్దరు పిచ్చోళ్లు.. ప్రాణాలే పణం

ఇద్దరు పిచ్చోళ్లు.. ప్రాణాలే పణం

కొందరికి ఫీట్లు చేయడమంటే సరదా. ఫీట్లు చేస్తూ ఫొటోలు దిగడమంటే మహా మహా సరదా. వాటిని ట్విట్టర్లోనో , ఫేస్ బుక్ లోనో, ఇన్ స్టాగ్రామ్​లోనో పెట్టేసి లైకులు, కామెంట్ల కోసం ఎదురుచూసేం త సరదా. కానీ, ఆ సరదా ఒక్కోసారి రివర్స్ అయిపోవచ్చు. లైకులకు బదులు తిట్లు వస్తుండొచ్చు. ఈ ఫొటోలో కనిపిస్తున్నోళ్లకు అదే జరిగింది. రాక్వెల్, మిగ్వెల్ అనే ఇద్దరు పోర్చ్​గీస్ బ్లాగర్లు కదులుతున్న రైల్లో ఇలా స్టంట్ చేశారు. రాక్వెల్ .. రైలు హ్యాండిల్ ను పట్టుకుని ప్రమాదకరంగా బయటకు వేలాడుతుంటే.. మిగ్వెల్ బయటకు ఒరుగుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అతడి కాళ్లు అంతో ఇంతో రైలు లోపలే ఉన్నా.. రాక్వెల్ మాత్రం దాదాపు బయటకొచ్చేసింది.

ఆ ఫొటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్​ చేయగా.. నెటిజన్లు లైకులకు బదులు తిట్ల వర్షం కురిపించారు. పిచ్చి పట్టిందా అంటూ విమర్శించా రు. కాలో, చెయ్యో జారి లోయలో పడితే ఏమైనా ఉందా అంటూ ఆందోళన చెందారు. ఒక్క ఫొటో కోసం ఇంత డేంజర్ స్టంట్ చేస్తారా అని ప్రశ్నించారు.

‘‘ఇద్దరు పిచ్చోళ్లు కొన్ని లైకుల కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు” అంటూ మండిపడ్డారు. జరగరానిదేదైనా జరిగితే ఏంటని ప్రశ్నలు కురిపించా రు. ఓ అమ్మాయి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే బదులు.. నువ్వే బయటకు వేలాడొచ్చుగా అంటూ మిగ్వెల్‌‌పై అసహనం వ్యక్తం చేశారు. వాళ్లు మాత్రం తమ స్టంట్‌‌ను సమర్థిం చుకున్నారు. తామేం రిస్క్​ చేయలేదని, ట్రైన్ స్లోగా వెళుతోందని వివరణ ఇచ్చింది రాక్వెల్ . అసలు తాము ఇంతకు ముందు చేసిన వాటితో పోలిస్తే ఇది పెద్ద ప్రమాదమేమీ కాదని ఆమె చెప్పిం ది. శ్రీలంకలోని ఎల్లాలో టూర్ సందర్భంగా వాళ్లు తీసుకున్న ఫొటో ఇది.