
హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్ కంపెనీ రఘు వంశీ మెషీన్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా దేశీయంగా తయారు చేసిన మైక్రో టర్బోజెట్ ఇంజన్ “ఇంద్ర ఆర్వీ25: 240ఎన్”ను ప్రారంభించింది.
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, రక్షణ మంత్రి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్డీఓ మాజీ చైర్మన్ సమక్షంలో ఆర్వీఎంటీ హైదరాబాద్ ఫెసిలిటీలో లైవ్టెస్టింగ్ ప్రయోగం జరిగింది. ఇది భారతదేశం ఏరోస్పేస్ రంగానికి ఒక గొప్ప విజయమని ఆర్వీఎంటీ పేర్కొంది. దీనిని చిన్న విమానాల్లో బిగిస్తారని తెలిపింది.