కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో వైఎస్ షర్మిల భేటీ

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో వైఎస్ షర్మిల భేటీ

న్యూఢిల్లీ, వెలుగు :   పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల చెప్పారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం నేపథ్యంలో షర్మిల శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ ఏపీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా పాల్గొన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో షర్మిలకు పార్టీలో ఇవ్వబోయే బాధ్యతలు, ఏపీ రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు.

 ప్రస్తుతం ఆమె సేవలను  ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ పై పోరాడినందున వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లో పర్యటించేలా పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. పార్టీలో బాధ్యతల అప్పగింతపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.