నవంబర్ 15న శబరిమల ఆలయం ఓపెన్.. దర్శనానికి నిబంధనలివే..

నవంబర్ 15న శబరిమల ఆలయం ఓపెన్.. దర్శనానికి నిబంధనలివే..

కరోనా వ్యాప్తి దృష్ట్యా గత కొన్ని నెలల నుంచి మూతపడ్డ శబరిమల దేవాలయం కోవిడ్ ప్రోటోకాల్స్‌తో నవంబర్ 15న తెరచుకోనుంది. ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే మండల-మకరవిలక్కు కోసం దేవాలయాన్ని తెరవనున్నారు. కఠినమైన కరోనా నిబంధనల మధ్య భక్తులను నవంబర్ 16 నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు. అదికూడా పోలీసుల వద్ద నమోదు చేసుకున్న భక్తులను మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతిరోజూ గరిష్టంగా 1,000 మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. కాగా.. వారాంతాల్లో మాత్రం 2 వేల మంది భక్తులకు ప్రవేశం ఉంటుంది. అయితే భక్తులు కోవిడ్ నెటిటివ్ సర్టిఫికెట్ల తీసుకెళ్లినా కూడా నీలక్కల్ వద్ద మరోసారి కోవిడ్ టెస్ట్ చేస్తామని కోవిడ్ నిబంధనలను రూపొందించిన నిపుణుల కమిటీ తెలిపింది. అయితే 60 ఏళ్లు పైబడిన వారిని మరియు 10 ఏళ్లలోపు పిల్లలను ఆలయంలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు తెలిపారు. ఎందుకంటే వీరంతా త్వరగా కరోనా బారినపడే అవకాశముందని అధికారులు తెలిపారు. కొండ మందిరాన్ని సందర్శించాలనుకునే భక్తులకు కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఆలయ అధికారులు తెలిపారు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు మరియు ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న వారు కూడా మందిరాన్ని సందర్శించవద్దని ఆలయ మండలి అభ్యర్థించింది.

అంతేకాకుండా దర్శనానికి వచ్చే భక్తులందరూ కోవి 19 జాగ్రతా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద భక్తులు పరీక్ష చేయించుకోవాలి. పంపా నదిలో భక్తులు స్నానం చేయడానికి అనుమతి లేనందున భక్తులు నది వద్దకు వెళ్లకుండా నిషేధం విధించారు. అంతేకాకుండా భక్తులు రాత్రివేళ సన్నిధానం మరియు గణపతి ఆలయం సమీపంలో బస చేయడం కూడా నిషేధించారు. అదేవిధంగా లాడ్జీలన్నీ కూడా మూసివేయబడ్డాయి. భక్తుల రద్దీని వర్చువల్ క్యూ పద్ధతిలో కేరళ పోలీసులు నియంత్రిస్తారు.

శబరిమల ఆలయంలో మండల పూజ డిసెంబర్ 26 మధ్యాహ్నం జరుగుతుంది. హరివారాసనం పాటతో అదే రాత్రి ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి జనవరి 14న మకరవిలక్కుతో మందిరం తెరవబడుతుంది. మకరవిలక్కు పూజల తర్వాత ఆలయం తిరిగి మూసివేయబడుతుంది.

For More News..

సీఐ పెట్రోలింగ్ వాహనంతో పారిపోయిన తాగుబోతు

తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు

నాకు కరోనా రాలేదు.. కిట్ లోపం వల్లే పాజిటివ్