ఆస్పత్రి నుంచి ట్వీట్ చేసిన సాయి ధరమ్ తేజ్

ఆస్పత్రి నుంచి ట్వీట్ చేసిన సాయి ధరమ్ తేజ్

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసి కోలుకుంటున్నానని ప్రకటించారు. ఆయన ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో ఇవాళ ఆయన తన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేస్తూ..  ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపించారు. గత సెప్టెంబర్ నెల 10వ తేదీన నగరంలోని కేబుల్ బ్రిడ్జి వద్ద బైకు పై నుంచి జారిపడి గాయపడిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. సాయితేజ్ హీరోగా నటించిన  రిపబ్లిక్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినిమాను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్  చేశారు. తన పట్ల  అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి థాంక్స్ అనే పదం చిన్నదవుతుందని.. త్వరలో అందర్నీ కలుస్తానంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.