
మరాఠీలో 2016లో విడుదలైన ‘సైరత్(Sairat)’ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి అన్ని పరిశ్రమల దృష్టినీ తనవైపుకు తిప్పుకుంది. ఇందులో నటించిన హీరోయిన్ రింకూ రాజ్గురు(Rinku rajguru)కు అవార్డులతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆర్చీగా అద్భుతంగా నటించింది. ఈ మూవీ తర్వాత పదో తరగతి పరీక్షలు ఉండటంతో చదువుపై ఫోకస్ పెట్టి ఇండస్ట్రీకి దూరమైంది.
Also Read :- మెగా ఇంటి కోడలిగా కృతిశెట్టి?
ఇప్పుడు రింకూ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా టాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ తొలి సినిమా ‘వెళ్లిపోమాకే’ దర్శకుడు యాకుబ్ అలీ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా రింకూను సెలక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావలసి ఉంది.