ఇకపై మా ప్రభుత్వానికి అన్ని మంచి శకునాలే... త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ

ఇకపై మా ప్రభుత్వానికి అన్ని మంచి శకునాలే... త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ

అమరావతి రైతులకు హైకోర్టు షాకిచ్చింది. తాజా తీర్పుపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. ఇకపై అన్నీ మంచి శకునాలే వస్తాయన్నారు. త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందని అభిప్రాయపడ్డారు.

రైతుల పిటిషన్లు కొట్టివేత

R5 జోన్​లో ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు దాఖలు చేసిన 2 అనుబంధ పిటిషన్లు కొట్టివేసింది ఏపీహైకోర్ట్. అన్యాయమైన డిమాండ్​ను కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారని.. రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతమని.. డిమొగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అనే అన్యాయమైన వాదనను తీసుకుని రావడం సరైంది కాదని మరోసారి తేలిపోయిందన్నారు.

టీడీపీ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోలేదు

లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంత్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు సజ్జల. ఇప్పటికే భూమి చదును వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని...టీడీపీ ప్రభుత్వం చట్టం ప్రకారం 5శాతం భూమిని పేదలకు కేటాయించాలనే నిబంధనను పట్టించుకోలేదన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా తగిన విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి .

త్వరలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ

అమరావతి ప్రాంతంలో ఇళ్ళ స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన మొత్తం లబ్దిదారులు 48,379. గుంటూరు జిల్లా పరిధిలో 24, 152 మంది లబ్దిదారులు.ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 24, 587 మంది లబ్దిదారులు. రాజధాని పరిధిలో పేదల ఇళ్ల పట్టాల కోసం 1134.58 ఎకరాల కేటాయించింది ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వులతో లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ శరవేగంగా సాగనుంది.