ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ , గ్రూప్ లోని అన్ని కంపెనీల సీఈఓల జీతాలకూ కోత పడనుంది. వ్యయ నియంత్రణలో భాగంగా టాప్ అఫీషియల్స్ జీతాలు తగ్గించాలని నిర్ణయించారు. టాటా గ్రూప్ చరిత్రలో జీతాల తగ్గింపు ఇదే మొదటిసారి కావడం విశేషం. టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ జీతం తగ్గింపు మొదటి నిర్ణయంగా వెలువడింది.
సీనియర్ అఫీషియల్స్ జీతాలలో కోత ఉంటుందని ఇప్పటికే ఇండియన్ హోటల్స్ ప్రకటించింది. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్ సహా ఇతర గ్రూప్ కంపెనీలలోనూ ఇదే నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ తగ్గింపు ప్రధానంగా ఈ ఏడాది బోనస్ ల రూపంలో ఉంటుంది.