- ప్రకటించిన మహీంద్రా లాజిస్టిక్స్
న్యూఢిల్లీ : మహీంద్రా లాజిస్టిక్స్ తన అసోసియేట్ కంపెనీ ట్రాన్స్టెక్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎల్పీఎల్) లో మొత్తం 39.79 శాతం వాటాలను విక్రయించనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సేల్ పూర్తయిన తర్వాత టీఎల్పీఎల్ కంపెనీకి అసోసియేట్గా ఉండదు. కంపెనీ బుధవారం జరిగిన సమావేశంలో టీఎల్పీఎల్లో కంపెనీకి ఉన్న 39.79 శాతం వాటాను అమ్మకం/బదిలీ కోసం ట్రాన్స్టెక్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో షేర్ పర్చేజింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇందుకోసం 65,988 షేర్లను జారీ చేస్తామని మహీంద్రా లాజిస్టిక్స్ బిఎస్ఇకి ఒక ఫైలింగ్లో తెలిపింది. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టీఎల్పీఎల్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 3.26 కోట్లు. టీఎల్పీఎల్లో కంపెనీకి ఉన్న 39.79 శాతం వాటా... టీఎల్పీఎల్ ప్రమోటర్లలో ఒకరైన అమర్నాథ్ కలాలే ('కొనుగోలుదారు')కి బదిలీ అయిందని
కొనుగోలుదారు కంపెనీ ప్రమోటర్/ప్రమోటర్ గ్రూప్/ గ్రూప్ కంపెనీలకు చెందినవారు కాదని ఫైలింగ్ పేర్కొంది. మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ అనేది సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ ఎంటర్ప్రైజ్ మొబిలిటీలో ప్రత్యేకత కలిగిన పూర్తిస్థాయి థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్.