హైదరాబాద్​లో సేల్స్​ఫోర్స్​ కంపెనీ

హైదరాబాద్​లో సేల్స్​ఫోర్స్​  కంపెనీ

హైదరాబాద్​, వెలుగు: సిటీలోని తన సెంటర్​ఆఫ్​ ఎక్స్​లెన్స్​ను సీఆర్​ఎం కంపెనీ  సేల్స్​ఫోర్స్​ భారీగా విస్తరిస్తోంది. ఈ సెంటర్​ ఆఫ్​ఎక్స్​లెన్స్​లో అదనంగా 4,500 సీట్ల కెపాసిటీని కంపెనీ యాడ్​ చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేష్​ రంజన్​ వెల్లడించారు. సేల్స్​ఫోర్స్​ గత పదేళ్లుగా ఇండియాలో పెట్టుబడులు పెడుతోంది. హైదరాబాద్ ​ సహా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, జైపూర్​లలో కలిపి ఈ కంపెనీకి మొత్తం 9 వేల మంది ఉద్యోగులున్నారు. 

తమ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్ ​ప్రోగ్రామ్​లో హైదరాబాద్​ సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​ ముఖ్యపాత్ర  పోషిస్తోందని సేల్స్​ఫోర్స్​ వెల్లడించింది. ఇటీవల తెచ్చిన కొత్త ప్రొడక్టులలో ఈ సెంటర్​ ఇంజినీరింగ్​ టీములకు భాగస్వామ్యం ఉందని పేర్కొంది. కొత్త సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​ 6.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 
ఏర్పాటు చేశారు.