రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది: సంపత్ కుమార్

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది: సంపత్ కుమార్

శాంతినగర్ , వెలుగు: వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో  ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని కాంగ్రెస్ పార్టీ  విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్​ ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కంప్లీట్ చేయలేదన్నారు. 

 ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు.  కాంగ్రెస్ అధికారంలో రాగానే  ప్రజల భవిష్యత్తు మారుతుందన్నారు. కార్యక్రమంలో  వడ్డేపల్లి దేవేంద్ర,  నాగ శిరోమణి, రామకృష్ణారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గడ్డం శీను, విశ్వనాథ రెడ్డి, సత్య ప్రసాద్ రెడ్డి, పచ్చర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.