న్యూఢిల్లీ: గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ హైదరాబాద్లో బుధవారం ఏ55, ఏ35 ఫోన్లను లాంచ్ చేసింది. హైసెక్యూరిటీ, హైరిజల్యూషన్ కెమెరాలు, భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు వీటి సొంతమని తెలిపింది. 2024 క్యాలెండర్ ఇయర్లో తన షిప్మెంట్ల 75శాతం ఫోన్లు 5జీవి ఉంటాయని పేర్కొంది.
ఇండియా 5జీ హాండ్సెట్స్ మార్కెట్లో తమకు 21శాతం మార్కెట్ వాటా ఉందని, స్మార్ట్ఫోన్ల అమ్మకాల విషయంలో 18 శాతం వాటాతో తాము నంబర్వన్ అని తెలిపింది. రూ. 30 వేలు–-50 వేల మధ్య ధర ఉన్న హ్యాండ్సెట్లలో తమకు 31శాతం వాటా ఉందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గుఫ్రాన్ఆలమ్ పేర్కొన్నారు.
