
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సందీప్ కిషన్.. ఫస్ట్ టైమ్ ఓ ప్యాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ‘మైఖేల్’ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీని రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇదో యాక్షన్ థ్రిల్లర్. ఇటీవల టీజర్తో ఆకట్టుకున్న టీమ్.. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్డేట్ను అనౌన్స్ చేసింది. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ‘నువ్వుంటే చాలు’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ను డిసెంబర్ 28న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పుస్కుర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. త్వరలో రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు.