
వంగూరు, వెలుగు: సోలార్ విద్యుత్ ప్లాంట్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయని రాష్ట్ర ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆయన టీజీ ఎస్పీడీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి పరిశీలించారు.
. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట రాంకో వైస్ చైర్మన్ అనిల్ వాయిలాల, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి, తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీడీవో బ్రహ్మచారి, ఆర్ఐ వసీం, మాజీ ఉప సర్పంచ్ ఎనుముల వేమారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శశిపాల్ రెడ్డి, అనిల్, లాల్ రెడ్డి పాల్గొన్నారు.