బాలయ్య షోలో స్పిరిట్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్కు పండగలాంటి వార్త

బాలయ్య షోలో స్పిరిట్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్కు పండగలాంటి వార్త

ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఏదైనా ఉందట అది స్పిరిట్(Spirit) మూవీ గురించే అని చెప్పాలి. దానికి కారణం ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) కావడం. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ బొమ్మని తీసిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరోల యాటిట్యూడ్ పై సినిమాలు తీయడంలో మనోడు స్పెషలిస్ట్. అందుకే ఆయన టేకింగ్ లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండబోతుంది అని ఫిక్స్ అయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. 

అయితే.. తాజాగా స్పిరిట్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు దర్శకుడు సందీవ్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న యానిమల్(Animal) మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళింది. యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్‌ షోకి వచ్చారు. 

ఇందులో భాగంగా మాట్లాడిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో ఆయన చేస్తున్న స్పిరిట్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. ఆయన చెప్పినదాని ప్రకారం స్పిరిట్ మూవీ 2024 సెప్టెంబర్ నుండి మొదలుకానుందట. యానిమల్ రిలీజ్ తరువాత దాదాపు 6 నెలలపాటు స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగనుంది. ఈలోపు ప్రభాస్ చేస్తున్న సలార్ రెండు పార్టులు రిలీజ్ అవుతాయో. కాబట్టి సెప్టెంబర్ లో స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలుకానుందని ఆయన వివరించారు. దీంతో ప్రబాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.   

Also Read :- నేనూ హీరోనే కదా.. అలా చేయమంటే ఎలా? అందుకే ఈ నిర్ణయం!