ఓటీటీ షోకు హోస్ట్ లుగా 'మీర్జా, మాలిక్'

 ఓటీటీ షోకు హోస్ట్ లుగా 'మీర్జా, మాలిక్'

భార‌త టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు త్వరలో విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిద్దరి గురించి మరో వార్త బయటికొచ్చింది. షోయబ్ మాలిక్ దంపతులు కలిసి త్వరలో ఓ షో చేయబోతున్నారు. ప్రముఖ పాకిస్థానీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉర్దూ ఫ్లెక్స్ లో ‘మీర్జా మాలిక్’ అనే టాక్ షో మొదలుకానుంది. 

ఈ కార్యక్రమంలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కలిసి హోస్ట్‌గా చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ఉర్దూప్లెక్స్‌ అఫిషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ షో కపిల్ శర్మ టాక్ షో తరహాలోనే ఉంటుందని సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరువురి అభిమానులు చర్చించుకుంటున్నారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010 ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2018లో కుమారుడు పుట్టాడు. అతడి పేరు ఇజాన్ మీర్జా మాలిక్‌. సానియా మీర్జా దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు.