పటాన్ చెరులో ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్

పటాన్ చెరులో ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్
  •     పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి  

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: పటాన్​చెరులోని మైత్రి మైదానంలో సంక్రాంతి సందర్భంగా ఎండీఆర్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బుధవారం  కైట్​ ఫెస్టివల్, ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీల్లో ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పతంగులను ఎగురేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరేళ్లుగా ఎండీఆర్​ ఫౌండేషన్​ పటాన్​చెరులో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ, కైట్​ఫెస్టివల్​ నిర్వహింస్తుండడం అభినందనీయమన్నారు. 

అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ఎండీఆర్​​ ఫౌండేషన్​ కో ఫౌండర్​ మాదిరి పృథ్వీరాజ్​తో కలిసి బహుమతులు అందజేశారు. జబర్దస్త్​ ఫేమ్​ కొమురమ్మ, ఇతర ఆర్టిస్టులు అందరిని ఉత్సాహపరిచారు. స్టేజీపై ఎమ్మెల్యే నాయకులతో కలిసి డ్యాన్స్​ చేశారు. భారతీనగర్​ కార్పొరేటర్​ సింధుఆదర్శ్​రెడ్డి, బీఆర్​ఎస్​ నియోజకవర్గ కో ఆర్డినేటర్​ ఆదర్శ్​ రెడ్డి, దేవేందర్​రాజు, నాయకులు గూడెం మధుసూదన్​రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్​, విజయ్​కుమార్​, పట్టణ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

 అయ్యప్ప ఆలయ నిర్మాణానికి  సంపూర్ణ సహకారం

అమీన్​పూర్​ సర్కిల్​ పరిధిలోని బీరంగూడ శివాలయం గుట్టపై నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ మొదటి స్లాబ్​ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రూ.3 కోట్ల అంచనాతో చేపట్టిన దేవాలయ నిర్మాణ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం పలువురు తమ విరాళాలను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్​మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి, మాజీ వైస్​ చైర్మన్​ నర్సింహాగౌడ్​, మాజీ ఎంపీపీ దేవానంద్, ఆలయ చైర్మన్​ సుధాకర్​యాదవ్, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు శశిధర్​రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.