సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టికెట్ల బుకింగ్లు షురూ

సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టికెట్ల బుకింగ్లు షురూ

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల నుంచి సంక్రాతికి సొంతూర్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే టికెట్​ బుకింగ్‌లను ప్రారంభించింది. 60 రోజుల ముందుగానే  అధికారులు ఈ టికెట్ల బుకింగ్​లు ప్రారంభించారు. త్వరలోనే సంక్రాంతి స్పెషల్​ రైళ్లను కూడా ప్రకటించనున్నారు. 

సోమవారం నుంచి టికెట్ల బుకింగ్ ​ప్రారంభం కాగా.. జనవరి 9వ తేదీ కోసం వాటిని జారీ చేశారు. జనవరి10కి మంగళవారం నుంచి,11కి బుధవారం నుంచి, 12వ తేదీకి గురువారం నుంచి టికెట్లను జారీ చేయనున్నారు. ఇలా జనవరి16 వరకు రిజర్వేషన్ ​చేసుకోవాలనుకునే వారికి ఈ నెల 17 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే ఐఆర్​టీసీ అధికారిక వెబ్​సైట్, యాప్​ ద్వారా బుక్​ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.