వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో నిఘా: సీపీ సుధీర్​ బాబు

వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో నిఘా: సీపీ సుధీర్​ బాబు

వినాయకనిమజ్జనానికి సరూర్​ నగర్​  మినీట్యాంక్​ బండ్​ చెరువును రాచకొండ సీపీ సుధీర్​ బాబు పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాచకొండ సీపీ పరిధిలో 10 వేల మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు.   సరూర్ నగర్ చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టపై 70 సీసీ కెమెరాలు, అలాగే ఈ  చెరువుకు వచ్చే రూట్లలో 200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.  ప్రస్తుతం నిమజ్జనానికి మూడు క్రేన్లు ఏర్పాటు చేశామని.. మహా నిమజ్జనం నాటికి ఎనిమిది క్రేన్​ లు అందుబాటులో ఉంటాయన్నారు.

ALSO READ | హైదరాబాద్లో వెరైటీ వినాయకులు

నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టపై విద్యుత్​ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.   భక్తుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచినీరు, మొబైల్​ టాయిలెట్స్​, సరూర్​ నగర్​ చెరువు చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యే వరకు సీసీ కెమారాలతో నిఘా.. పోసీస్​ సిబ్బంది గస్తీ ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో   సీపీ తో పాటు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి,GHMC డిప్యూటీ కమిషనర్ సుజాత తదితరులు ఉన్నారు .