
సింగపూర్: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. సింగపూర్ ఓపెన్లో సెమీస్తోనే సరిపెట్టుకుంది. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్లో వరల్డ్ 27వ ర్యాంకర్లు సాత్విక్–చిరాగ్ 21–19, 10–21, 18–21తో మూడో సీడ్ ఆరోన్ చియా–సోహ్ వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడారు. గంటా 4 నిమిషాల పోరాటంలో ఇండియన్ ద్వయం తృటిలో తొలి గేమ్ను చేజార్చుకుంది. 8–7తో ఆధిక్యంలో ఉన్న దశలో స్మాష్లు తీయడంలో ఇబ్బందిపడింది. దీంతో మలేసియా జంట వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది.
ఈ దశలో పుంజుకున్న సాత్విక్–చిరాగ్ 19–19తో స్కోరు సమం చేశారు. కానీ చివర్లో నెట్ వద్ద రెండు డ్రాప్స్ వేసిన ఆరోన్–సోహ్ గేమ్ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్లో మలేసియా జోడీ ఏ దశలోనూ ఇండియన్లకు పోటీ ఇవ్వలేకపోయింది. 5–0తో మొదలైన గేమ్ను ఎక్కడా సమం చేయలేదు. హోరాహోరీగా సాగిన డిసైడర్లో 6–6 స్కోరు వరకు ఇరుజట్లు గట్టిగా పోరాడాయి. ఇక స్కోరు 20–12 ఉన్న దశలో సాత్విక్–చిరాగ్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గినా గేమ్ను చేజిక్కించుకోలేకపోయింది.