
దుబాయ్: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సాత్విక్ సాయిరాజ్, ముంబైకర్ చిరాగ్ షెట్టి ఇండియన్ బ్యాడ్మింటన్లో గోల్డెన్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఖతర్నాక్ ఆటతో ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లో గోల్డ్ నెగ్గిన దేశ తొలి డబుల్స్ జంటగా తమ పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 58 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగా టోర్నీలో ఇండియాకు మరో బంగారు పతకం అందించారు. ఆదివారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో ఆరో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 16–-21, 21–-17, 21-–19తో మలేసియా షట్లర్లు యు సిన్–టియో యెయిపై అద్భుత విజయం సాధించారు. 1965లో మెన్స్ సింగిల్స్లో గోల్డ్ నెగ్గిన దినేష్ ఖన్నా తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన ఇండియన్స్ గా నిలిచారు.
దీపు ఘోష్–రామన్ ఘోష్ 1971లో నెగ్గిన బ్రాంజ్ మెడలే మెన్స్ డబుల్స్లో ఇండియాకు ఇప్పటిదాకా బెస్ట్ పెర్ఫామెన్స్. 22 ఏండ్ల సాత్విక్, 25 ఏండ్ల చిరాగ్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఇండియా నంబర్ వన్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్స్టర్స్ టైటిల్ ఫైట్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ చేశారు. ఫస్ట్ గేమ్లో ఓడినా అద్భుతంగా పుంజుకున్నారు. బలమైన డిఫెన్స్ చూపెట్టిన ప్రత్యర్థులపై పదునైన స్మాష్లు, యాంగిల్ షాట్లతో విరుచుకుపడ్డారు. రెండో గేమ్లో 7–13తో, మూడో గేమ్లోనూ 11–15తో వెనుకబడినప్పటికీ ఎక్కడా ఆత్మవిశ్వాసం, పట్టుదల కోల్పోకుండా ఆడి గెలిచారు. ఈ టోర్నీ హిస్టరీలో ఇండియాకు ఇది రెండో గోల్డ్ కాగా.. అన్ని ఎడిషన్లలో కలిపి17 బ్రాంజ్ మెడల్స్ కూడా లభించాయి.
నమ్మలేకపోతున్నా
మేం ఇప్పుడు ఆసియా చాంపియన్స్ అంటే నమ్మడానికి చాలా సమయం పట్టేలా ఉంది. టోర్నీ ఏదైనా గెలిచి, ఇండియా జెండాను రెపరెపలాడించాలన్నదే మా కల. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్లోకి అడుగు పెడుతున్న టైమ్లో వచ్చిన ఈ విజయం మాలో జోష్ నింపుతోంది. ఫైనల్లో మాకు మంచి ఆరంభం లభించలేదు. అయినా పోరాటాన్ని ఆపకుండా ఒత్తిడిని తట్టుకొని మ్యాచ్ గెలిచాం. స్టేడియంలో ఫ్యాన్స్ సపోర్ట్ చూస్తే హైదరాబాద్లో ఆడినట్టు అనిపించింది. - సాత్విక్ సాయిరాజ్