కోపెన్హగెన్ : సూపర్ ఫామ్లో ఉన్న ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్పై గురి పెట్టారు. సోమవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్స్ సాత్విక్–చిరాగ్ ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు. రెండో సీడ్గా బరిలోకి దిగుతున్న ఈ జంటకు ఫస్ట్ రౌండ్లో బై లభించింది. మెన్స్ సింగిల్స్లో ఫామ్లో ఉన్న హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్పైనా అంచనాలున్నాయి.
ప్రణయ్ 56వ ర్యాంకర్ కొల్జోనెన్ (ఫిన్లాండ్)తో, సేన్ 110వ ర్యాంకర్ జులియెన్ పాల్ (మారిషస్)తో తలపడనున్నాడు. శ్రీకాంత్కు తొలి రౌండ్లోనే జపాన్ స్టార్ కెంటా నిషిమొటోతో సవాల్ ఎదురవనుంది. ఫామ్ కోల్పోయిన పీవీ సింధుకు ఫస్ట్ రౌండ్లో బై లభించింది. డబుల్స్లో గాయత్రి–ట్రీసా జాలీ, అశ్విని భట్–శిఖ, మిక్స్డ్లో సిక్కిరెడ్డి–రోహన్ బరిలో ఉన్నారు.