ఎస్​బీఐ డిపాజిట్లపై వడ్డీ పెంపు

ఎస్​బీఐ డిపాజిట్లపై వడ్డీ పెంపు

న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) రూ.రెండు  కోట్లలోపు ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లపై (ఎఫ్​డీలు) వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఎస్​బీఐ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ ప్రకారం, ఎఫ్​డీ వడ్డీ రేట్ల పెరుగుదల డిసెంబర్ 27 నుంచి అమలులోకి వస్తుంది. అలాగే బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై ఎఫ్​డీ రేట్లను కూడా పెంచింది. ఏడు రోజుల నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 3 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది. ఇది 50 బేసిస్ పాయింట్ల పెంపు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ 46 రోజుల నుంచి 179 రోజుల వ్యవధిపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు ఉన్న 4.50 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది. 180 రోజుల నుంచి 210 రోజుల వ్యవధిలో 5.25 శాతం నుంచి 5.75 శాతానికి, అంటే బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న ఎఫ్​డీల కోసం  వడ్డీ రేటును 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 6.75కి పెరిగింది. ఇతర టెనార్ల రేట్లు యథాతథంగా ఉంటాయి.  400 రోజుల అమృత్ కలశ్ పథకానికి​ 7.10 శాతం వడ్డీ రేటు ఇస్తారు. ఇది 12- ఏప్రిల్- 2023 నుంచి వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.60శాతం వడ్డీ రేటుకు అర్హులు. ఈ పథకం 31-మార్చి-2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది.